బిచ్చగాడు , డి 16, టిక్ టిక్ టిక్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్. ఈ బ్యానర్పై చదలవాడ శ్రీనివాసరావు పలు హిట్ చిత్రాలని రూపొందించారు. ఇప్పుడు ఆయన తనయుడు లక్ష్ చదలవాడ హీరోగా వలయం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హిప్పీ ఫేమ్ దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శ్రీను తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆమె ఎవరు అంటూ క్వశ్చన్ మార్క్తో మోషన్ పోస్టర్ ఉంది. ఇది అభిమానులని ఆకట్టుకుంటుంది.
ఫిబ్రవరి 2020లో వలయం సినిమా విడుదల కానుంది. చదలవాడ లక్ష్మణ్ కెరీర్ ప్రారంభంలో హీరోగా రాణించాలనుకున్నారు. ఒకట్రెండు సినిమాలు కూడా చేశారు. అయితే అవేవీ హిట్ కాకపోవడంతో లక్ష్మణ్ అలియాస్ లక్ష్ సైలెంట్గా ఉండిపోయాడు. తాజాగా.. మరోసారి లక్ష్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. చూడాలి ఈ సారైన మంచి విజయం సాధిస్తాడో లేదో..!